గత కొద్ది కాలంగా బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే… “రియల్ స్టోరీస్ మీద రీల్ మాజిక్!”. ఎంత ఫిక్షన్ వచ్చినా, నిజ జీవిత కథలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సంజు, హాకీ దిగ్గజం మీద వచ్చిన చక్ దే ఇండియా, గంగూబాయి కతియావాడి వంటి బయోపిక్లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో… ఇప్పుడు బాలీవుడ్ మరో అద్బుతమైన చాప్టర్ తెరపైకి రానుంది — అల్ టైమ్ ట్రాజిక్ క్వీన్, మీనా కుమారి జీవితం!
ఇప్పటికే ఫ్యాషన్ డిజైనర్గా తనదైన ముద్ర వేసుకున్న మనీశ్ మల్హోత్రా, ఈసారి దర్శకుడిగా మారి, మీనా కుమారి బయోపిక్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ కోసం చాలా మంది ప్రముఖ హీరోయిన్లు పోటీపడ్డారట. అయితే చివరకు ఈ ఆత్మగాథకు న్యాయం చేయగల హీరోయిన్గా కియారా అడ్వాణీని ఎంపిక చేసారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘‘మీనా కుమారి పాత్రలో అవసరమైన ఉత్సాహం, లోతైన భావోద్వేగం, ఆ గంభీరత – ఇవన్నీ కియారా నుంచి వస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. ఆమెకు పాత్రపై అపారమైన ఆసక్తి ఉంది. స్క్రిప్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం కియారా అడ్వాణీ వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నా… ఈ బయోపిక్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మీనా కుమారి పాత్ర అంటే కేవలం గ్లామర్ కాదు… ఓ శోక భరితమైన ఆత్మగాధ, దురదృష్టపు ప్రతీక. అలాంటి పాత్రలో నటించడం అంటే అది నటనకు పరీక్ష మాత్రమే కాదు… ఓ విలువైన ప్రయాణం.
బయోపిక్లు మరోసారి బాలీవుడ్కు భావోద్వేగ గాథల వేదికగా మారబోతున్నాయేమో?
ఈసారి మీనా కుమారి రూపంలో!
వేచి చూడాలి… “ట్రాజెడీ క్వీన్”గా కియారా ఎలా మెరిసిపోతుందో